ఇదేం పిచ్చి పని.. కుటుంబం పట్టించుకోవడం లేదని ఓ యువకుడు ఏం చేశాడంటే ?
ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన స్కూల్లో విషప్రయోగం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిస్టుగా గుర్తించారు. అయితే కుటుంబం పట్టించుకోవడం లేదని.. అందుకే ఏదైనా సంచలనంగా చేయాలని ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలకు గత శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో.. సిబ్బంది వంట గదికి తాళం వేసి ఇంటికెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసే ముందు పాత్రలు కడుగుతుండగా వాటిలోంచి చెడు వాసనతో పాటు నురుగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ గమనించగా, అక్కడ పురుగుల మందు డబ్బా కనబడింది.

తాగు నీటి ట్యాంక్ను పరిశీలించగా, అందులోనూ అదే విషాన్ని కలిపినట్లు గుర్తించారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాఠశాల సిబ్బంది కంప్లైంట్ మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో పాఠశాల ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఖాళీ పురుగుల మందు డబ్బా లభ్యమైంది. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిలో ఒకడైన సోయం కిస్టు నేరం అంగీకరించాడని తెలిపారు. అతను పాఠశాల సమీపంలోనే నివసిస్తున్నట్టు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఎస్పీ తెలిపారు.
తన కుటుంబ సభ్యులు తనను పట్టించుకోకపోవడంతో.. వారి దృష్టిని ఆకర్షించడానికే ఈ పని చేసినట్లు కిస్టు చెబుతున్నాడు. తన సోదరుడు పత్తి చేను కోసం తెచ్చిన పురుగుల మందునే ఆ పని చేయడానికి ఉపయోగించానన్నాడు. పాత్రలపై మందు చల్లి, బకెట్లోని నీటిలో కలిపానని.. ఓవర్ హెడ్ ట్యాంకులో మాత్రం కలపలేదని అంటున్నాడు. ఏ పనిలోనూ తనకు సహకరించడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉండి ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు వివరించారు. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
క్షణికావేశంలో.. పిచ్చి ఆలోచనలతో ఈ తరహా పనులు చేయడం ఏంటని.. సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వంట పాత్రల్లో వండి.. చిన్నారులకు ఏదైనా జరిగి ఉంటే ఆ నష్టాన్ని ఎవరు తీర్చేవారని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఎవరు ఈ తరహా ఘటనలకు పాల్పడవద్దని హితబోద చేస్తున్నారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications