ఒంటరి మహిళలే లక్ష్యం: చైన్ స్నాచర్ల అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నలుగురు దొంగలను శుక్రవారం సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3లక్షలు విలువచేసే 24.5తులాల బంగారు గొలుసులు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వివరాలను క్రైం అదనపు డిసిపి జానకిషర్మిల మీడియాకు తెలిపారు.
గోల్కొండ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్ అఫ్రోజ్.. ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు 19 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళల మెడలో ఉన్న గొలుసులను రెప్పపాటులో ఎత్తుకెళ్తుండేవాడు. ఇతడికి లంగర్హౌజ్కు చెందిన మహ్మద్ జాఫర్, రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, ఏసిగార్డ్స్కు చెందిన ఇర్ఫాన్లు అనుచరులుగా మారారు.

వీరందరూ కలిసి ఇప్పటి వరకు వనస్థలిపురం, మీర్పేట, చందానగర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, తదితర పోలీస్ స్టేషన్ పరిధిల్లో 19 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాలు బయటపెట్టారు. గతంలో అప్రోజ్ను హుమాయన్నగర్ పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యాడు.
మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రైం అదనపు డిసిపి-2 ముత్తయ్య, క్రైం ఏసిపి రాములునాయక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కాసిరెడ్డిలను డిసిపి జానకిషర్మిల అభినందించారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications