పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేసి పట్టుకున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో 350మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు, హోటళ్లు, కార్ఖానాలల్లో పనిచేస్తున్న 46 మంది బాల కార్మికులను పట్టుకొని బాలల సంరక్షణ విభాగానికి చెందిన అధికారులకు అప్పగించారు.
పలు బస్తీలకు చెందిన 30మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నిల్వవుంచిన 60 బియ్యం సంచులు(50కిలోలు) 300లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్ లా అండ్ ఆర్డర్, టాస్క్ఫోర్సు పోలీసులు 40 బృందాలుగా ఏర్పడి పాతబస్తీలోని ఛత్రినాకా, కంచన్బాగ్, హుస్సేని ఆలం పోలీసు స్టేషన్ల పరిధిలోని అమ్జదుల్లాబాగ్, వట్టేపల్లి, ఫాతిమానగర్, ఫారూఖ్నగర్, భవాని నగర్, జంగమ్మెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
సయ్యద్, ఆరిఫ్ నవాబ్ అక్రమంగా నిల్వవుంచిన 50కిలోల 60 రేషన్ బియ్యం బస్తాలు పట్టుకున్నారు. 300లీటర్ల కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ పూర్ణియ జిల్లాకు చెందిన 12మంది బాల కార్మికులను, జార్ఖండ్కు చెందిన 14మంది మాలలను, కోల్కతకు చెందిన 4గురు బాలలను గుర్తించారు.
కార్జన్ సెర్చ్
హైదరాబాదులోని పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 350 మంది పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేశారు.
బాల కార్మికులకు విముక్తి
పోలీసులు తమ సోదాల్లో బాలకార్మికులకు విముక్తి కలిగించారు. వీరు పలు ప్రాంతాల్లో పనిచేస్తుండగా పట్టుకొని బాలల సంరక్షణ విభాగం అధికారులకు అప్పగించారు.
రౌడీ షీటర్లు..
అక్రమ ఆయుధాలు కలిగి, రౌడీలుగా వ్యవహరిస్తున్న 30మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు.
గ్యాస్ రీఫిల్లింగ్ ముఠా..
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 8సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.