హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీధి రౌడీలా పోలీసు: చిత్తుగా తాగేసి అమ్మాయితో బైక్‌పై వెళ్తుంటే...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిత్తుగా మద్యం సేవించిన ఓ పోలీసు కానిస్టేబుల్ తనిఖీల పేరుతో ఆగడానికి దిగాడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్టేషన్‌లో శుక్రవారం వీధిరౌడీలా వ్యవహరించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. బైక్‌పై అమ్మాయితో వెళ్తున్న ఓ యువకుడిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు అతని ఆగడానికి కళ్లెం వేశారు.

గోపాల్‌పురం పోలీసుల కథనం ప్రకారం - సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన శ్యాంసన్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. శ్యాంసన్ మరో మహిళతో కలిసి ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్ మారేడ్‌పల్లి వైపు వెళ్తుతున్నాడు. వీరిని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నర్సింహా రావు వెంబడించాడు.

 Police harassed boy and girl in hyderabad

రాంగ్‌రూట్‌లో వెళ్తున్నావని శ్యాంసన్‌ను కర్రతో కొట్టేందుకు ప్రయత్నించాడు. శ్యాంసన్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బాధితుడు గోపాలపురం పోలీస్టేషన్‌లో నర్సంహపై ఫిర్యాదు చేశాడు. సైదాబాద్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సికింద్రాబాద్‌లో ద్విచక్ర వాహనదారుడిని ఆపి బెదిరించి డబ్బులు అడగటంపై స్థానిక పోలీసులే ఆగ్రహం వ్యక్తం మండిపడుతున్నారు.

బాధితుడు శ్యామ్‌సన్ ఫిర్యాదుతో గోపాల్‌పురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్ దర్యాప్తు జరుపుతున్నారు. నరసింహారావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్ల క్రితం సహ కానిస్టేబుల్ భార్యను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో జైలు పాలైన నరసింహారావు మూడేళ్లు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. కోర్టు తీర్పుతో తిరిగి ఉద్యోగంలో చేరాడు.

English summary
A police constable Narasimha Rao arrested by Gopalapuram police in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X