'నిజాం విదేశీయుడు, ఇప్పుడు 'ఐసిస్' ఏం చేస్తుందో నాడే రిజ్వీ చేశాడు'
హైదరాబాద్: నిజాం పూర్వీకులు బాబరు, ఔరంగజేబు దేవాలయాల విధ్వంసకులు అని, నిజాం భావాలు ఔరంగజేబులాంటివేనని, నిజాం విదేశీయుడని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా బుధవారం నాడు అన్నారు.
భాగ్యనగరంలోని బంజారాహిల్స్లో హిందూ బంధం సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం - హిదూ ఐక్యతపై ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చాక సంస్థానాలు పాకిస్తాన్లోనో, హిందూస్తాన్లో గాని కలపవచ్చని బ్రిటిష్ పన్నిన కుటిల పన్నాగంతో హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లీంస్థాన్గా మార్చాలని నిజాం ఆలోచించాడని విమర్శించారు.

ఈ రోజు సిరియాలో ఐసిస్ ఏం ప్రకటిస్తుందో ఆ రోజు రిజ్వీ అదే ప్రకటించాడన్నాడు. జిహాదీ పేరిట హిందూవాదంపై యుద్ధం ప్రకటించే నాటి, నేటి వాతావరణాల మధ్య తేడా ఏమీ లేదన్నారు. బాబర్, ఔరంగజేబు వారసులకు ఈ దేశం లొంగదన్నారు.
నిజాం విదేశీయుడని, ఆయన పూర్వీకులు బాగ్దాద్(ఇరాక్)కు చెందిన వారన్నారు. హైదరాబాద్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications