మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం: 16మందితో లిఫ్ట్ తెగిపడింది!
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ టీఆర్ఎస్ కౌన్సిలర్ తనయుడు ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన జోగు రామన్న, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సహా 16మందితో మూడో అంతస్తుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా మొదటి అంతస్తులోనే వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ కిందపడిపోయింది.
ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే తేరుకొని గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో ఉన్న మంత్రి రామన్న, ఎమ్మెల్యే దివాకర్ రావు సహా అందరినీ కుర్చీలు వేసీ బయటకు తీశారు.

నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్లో 10మంది మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉండగా, 16మంది వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. అయితే, మంత్రి సహా మిగితా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మంత్రి రామన్న ఆస్పత్రిని ప్రారంభించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications