ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు బంద్.. పెద్ద రీజనే భయ్యా!
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు కళాశాలలు, పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్నాయి. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఈ బంద్ దేనికి అనేది తెలిస్తే మాత్రం కాస్త ఆశ్చర్య పోవాల్సిందే. సహజంగా విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే విద్యార్థి సంఘాలు పని చేస్తాయి.
విద్యా సంస్థలు బంద్
అటువంటి విద్యార్థి సంఘాలు భౌతిక దాడులకు పాల్పడడం, చందాలను వసూలు చేయడం వంటి వాటిని నిరసిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేశాయి. బంద్ లో భాగంగా నేడు స్కూల్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించారు.

భౌతిక దాడులు చేస్తూ, వసూళ్లకు పాల్పడే వారిపైన చర్యలు
హనుమకొండ కలెక్టర్ కు, జిల్లా పోలీసు అధికారులకు విద్యార్థి సంఘాల పేరుతో భౌతిక దాడులు చేస్తూ, వసూళ్లకు పాల్పడే వారిపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఈ తరహా దాడులు హేయమైన చర్య అని పేర్కొన్న వారు భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హన్మకొండ స్మైలీ డిజి స్కూల్ కరస్పాండెంట్ పై పీడీఎస్యూ నాయకుల దాడి
ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్ కు పిలుపునివ్వడంతో కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. నిన్న హన్మకొండలోని స్మైలీ డిజి స్కూల్ కరస్పాండెంట్ ఎస్ శ్రీనివాస్ వర్మపై పిడిఎస్యు నాయకులు దాడి చేయడంతో, ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పిడిఎస్యు నాయకుల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్
హన్మకొండ పోలీసులు వారి పైన కేసు నమోదు చేశారు. స్కూల్ కరస్పాండెంట్ పై విద్యార్థి సంఘాల నాయకుల దాడితో ఈ భౌతిక దాడులు, చందాల వసూళ్ల దందాల పై ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు జిల్లావ్యాప్తంగా బంద్ ను కొనసాగిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ ఈ భౌతిక దాడిని తీవ్రంగా ఖండించింది.
ఈ జిల్లాలలో స్కూల్స్, కాలేజీలు నేడు బంద్
ఈ పరిణామాల నేపథ్యంలోనే హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలలో నేడు బంద్ కొనసాగుతుంది. ఈ నిరసన బంద్ కు పి ఎస్ టి, టీపి జె ఎంఏ, కే యు పి ఎం ఏ వంటి ఇతర సంఘాలు కూడా మద్దతును ప్రకటించాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications