పుష్కరాల పూర్తి సమాచారమున్న వెబ్సైట్ ఇది..
కరీంనగర్: ఓం శ్రీ సాయి జ్యోతిష్య విద్యాపీఠం, ధర్మపురి నిర్వాహకులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ రూపొందించిన గోదావరి పుష్కరాల వెబ్ సైట్ www.pushkaralu.com ప్రారంభమైంది.
దీనిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ స్థానిక లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థానంలో ప్రారంభించారు.
ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు గోదావరి పరీవాహక ప్రాంతాలైన నాసిక్, బాసర, ధర్మపురి, భద్రాచలం, రాజమండ్రి మొదలైన పుణ్యక్షేత్రాల పూర్తి సమాచారం ఉంటుంది.
పుష్కరాల వెబ్ సైట్
ఓం శ్రీ సాయి జ్యోతిష్య విద్యాపీఠం, ధర్మపురి నిర్వాహకులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ రూపొందించిన గోదావరి పుష్కరాల వెబ్ సైట్ www.pushkaralu.com ప్రారంభమైంది.
పుష్కరాల వెబ్ సైట్
వాటితో పాటు పుష్కరాల విశిష్టత, 12 రోజులలో నిర్వహించవలసిన రోజువారి శ్రాద్ధ, దాన, పూజా కార్యక్రమాల వివరాలు పొందుపరిచినట్లు వెబ్ సైట్ నిర్వాహకులు చెప్పారు.
పుష్కరాల వెబ్ సైట్
తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాల సమాచారార్థం ఏర్పాటు చేసిన తొలి వెబ్ సైట్గా ఇది గుర్తింపు పొందనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఇది ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని వారు చెప్పారు.
పుష్కరాల వెబ్ సైట్
పన్నెండేళ్లకోసారి గోదావరి పుష్కరాలు జరిగే విషయం తెలిసిందే. బాసర, ధర్మపురి, భద్రాచలం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో భక్తులు లక్షలాదిమంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు.