షాక్: తుమ్మల చక్రం, తెరాసలోకి ఎమ్మెల్యే పువ్వాడ? రంగంలోకి జానా
ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మంత్రి, పాలేరు తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు స్వయంగా మంత్రాంగం నడిపి ఈ ఉదయం అజయ్తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆపై తన ముఖ్య అనుచరులతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్న అజయ్.. తెరాసలోకి జంప్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

సోమవారం నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో లేదా బుధవారం జరిగే తెరాస ప్లీనరీలో అజయ్ పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావు తనయుడు పువ్వాడ అజయ్.
పువ్వాడ అజయ్ పార్టీ మారనున్నారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి రంగంలోకి దిగారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ పువ్వాడ అందుబాటులోకి రాలేదు. దీంతో జానా రెడ్డి ఫోన్ ద్వారా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. తొందరపడవద్దని సూచించారని సమాచారం.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications