రాడిసన్ డ్రగ్స్ కేసు: నేడు విచారణకు హాజరు కాలేనన్న డైరెక్టర్ క్రిష్!!
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించైనా విషయం తెలిసిందే. ఇది టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు వివేకానంద పోలీసులకు పట్టిబడిన విషయం తెలిసిందే.
అయితే ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టు మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ వెల్లడించారు. అయితే ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న క్రిష్ ను విచారణకు పిలిచాము అని, ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ను విచారణకు రావాలని పోలీసులు ఆయనకు ఫోన్ కాల్ చేసి చెప్పారు. ఇదిలా ఉంటే రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వ్యవహారంలో తాను విచారణకు సహకరిస్తానని చెబుతూనే, డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని, మరో రెండు రోజులు తనకు సమయం కావాలని కోరారు.
శుక్రవారం నాడు వ్యక్తిగతంగా తాను విచారణకు హాజరవుతానని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు సెలబ్రిటీలు శ్వేత, నీల్, సినీనటి లిషి, రఘు చరణ్, సందీప్ తదితరులు ఉన్నారు. ఇక వీరందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్ లో ప్రముఖుల చిట్టా ఉందని, పలువురు అతనితో చాటింగ్ చేశారని గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఉన్న వారందరినీ విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications