హెచ్సీయూకు రాహుల్ గాంధీ: రోహిత్ ఆత్మహత్యకు ముందు రోజు ఏం జరిగింది?
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియూ)లో పిహెచ్డి స్కాలర్ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ రాత్రి విద్యార్ధి సంఘాల నేతలతో గొడవ పడిన ఓ వీడియో మీడియాలో హల్చల్ చేస్తోంది.
సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదంటే..: రోహిత్ ఆత్మహత్యపై వైస్ ఛాన్స్లర్
ఈ వీడియోలో ఏబీవీపీ బ్యానర్ కనిపించినందుకే చించానని రోహిత్ అందులో చెబుతున్నట్లుగా ఉంది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న బ్యానర్ను నీకు నచ్చలేదని చించుతావా? అంటూ విద్యార్ధి సంఘాల నేతలు రోహిత్తో వాగ్వాదానికి దిగారు. మీ ఇంట్లో చీరలు కూడా ఇంతే చించుతావా అంటూ ఏబీవీపీ నేతలు రోహిత్ను నిలదీశారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ రోజు రాత్రి రోహిత్తో విద్యార్ధి సంఘాల నేతలు వాగ్వాదం చేసుకున్న వీడియో మంగళవారం మీడియాలో హల్చల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రోహిత్ ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నేతలతో వాగ్వాదానికి దిగారు.

అయితే ఈ విషయం తెలిసిన వీసీ అప్పారావు విద్యార్ధి సంఘాల నేతల మధ్య సమస్యసలను సామరస్యంగా పరిష్కరించక పోవడం వల్లనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని యూనివర్సిటీ విద్యార్ధులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు.
ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. పీహెచ్డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటనకు గల కారణాలపై విద్యార్ధులతో మాట్లాడతారు.
మరోవైపు హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని, అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని జేఏసీ నాయకులు తెలిపారు. హెచ్సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications