Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

railway news: మేడారం మీదుగా ఆ రైల్వే ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచిన కేంద్రం!

తెలంగాణా రాష్ట్రంలో రైల్వే ప్రగతిలో పరుగులు పెడుతుంది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో ప్రజల అవసరాలకు తగ్గట్టు రైళ్ళ సంఖ్యను పెంచటం, కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయటం చేస్తున్న రైల్వే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసింది.

వేగంగా మణుగూరు-రామగుండం రైల్వే లైన్ భూసేకరణ
ఇదే క్రమంలో తెలంగాణా రాష్ట్ర రైల్వే పురోగతికి పెద్ద పీట వేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని మణుగూరు-రామగుండం రైలు మార్గంలో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు అనుమతించినందున ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేందుకు కొందరు ముఖ్య అధికారులను నియమిస్తూ కేంద్రం అక్టోబర్ 16న ప్రత్యేక నోటీసులిచ్చింది.

railway news Manugur ramagundam railway line works that goes through Medaram at jet speed

అధికారులకు భూసేకరణ బాధ్యతలు
జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ రైల్వే ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సిన భూములను అధికారులు గుర్తిస్తున్నారు. భూపాలపల్లి ఆర్డీఓ, కాటారం సబ్ కలెక్టర్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ ఈ భూసేకరణ బాధ్యతలను చేపట్టారు. భూసేకరణకు సంబంధించి నష్ట పరిహారం ఎంత ఇవ్వాలి అన్న దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. మల్హర్‌రావు, కాపురం మండలాలు కాటారం సబ్ కలెక్టర్ చూస్తుండగా, ఘన్‌పూర్‌, భూపాలపల్లి మండలాలను భూపాలపల్లి ఆర్డీఓ చూస్తున్నారు.

మేడారం మీదుగా రైల్వే లైన్ పనులు
ముత్తారం, మంథని, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి ప్రాంతాలకు పెద్దపల్లి అదనపు కలెక్టర్ భూసేకరణ పనులు చూస్తున్నారు. కాటారం, మల్హర్‌రావు, ఘన్‌పూర్‌, భూపాలపల్లి మండలాల మీదుగా మేడారం నుండి మణుగూరు వరకు 207.80కిలోమీటర్ల మేర బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పనులు చేపట్టేలా రైల్వే శాఖ నివేదికలు తయారు చేసింది.

బొగ్గు రవాణాకు కీలకంగా రైల్వే లైన్
ఈ ట్రాక్ ఆలోచన మొదట 1999 లో రాగా, మళ్ళీ 2013-14లో దీనిపై దృష్టి సారించారు. మొదట 1,100 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని భావించిన వారు ఇప్పుడు దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ రైలు ట్రాక్ చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అవసరమైన బొగ్గును రవాణా చేయటం కోసం సహాయపడుతుంది.

సమ్మక్క ఆలయానికి సులభంగా చేరుకునే వీలు
పర్యాటకులు వెళ్లడానికి ఇష్టపడే వివిధ ప్రాంతాలకు ప్రజలు మరింత సులభంగా ప్రయాణించడానికి కూడా ఈ రైల్వే ట్రాక్ సహాయపడుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ తాడ్వాయి గుండా వెళుతుంది. దీని వలన సందర్శకులు మేడారంలోని సమ్మక్క మరియు సారలమ్మ దేవాలయాలకు చేరుకోవడం సులభం అవుతుంది.ఈ రైలు మార్గం ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో సరకు రవాణాను సులభతరం చేయడం ద్వారా వ్యాపారాల వృద్ధికి కూడా దోహదపడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+