హైదరాబాద్లో భారీ వర్షం: కొట్టుకుపోయిన కార్లు, గుంతలో బస్సు
హైదరాబాద్: హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో కురిసిన వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామైంది. ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కార్లు కొట్టుకుని పోయాయి. సికింద్రాబాదు వద్ద డ్రైనేజీ గుంతలో బస్సు దిగబడింది.
సరూర్నగర్, మీర్ పేటల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మైత్రీవనం, సికింద్రాబాదుల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. అంబర్పేట, విద్యానగర్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, లక్డీకా పూల్, ఆబిడ్స్, కోఠీ, దిల్షుక్నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
సికింద్రాబాదు, వారాసిగుడా, మెట్టుగుడ, ఉప్పల్, పార్సీగుట్ట, అడ్గగుట్ట, రామంతపూర్ తదితర ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదులోని పంజగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది.