Heat wave 2024: భానుడి భగభగ; 5రోజులు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు.. జాగ్రత్త
మండుతున్న ఎండలతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులు బయటకు వెళ్లాలంటేనే భయాందోళన కలిగిస్తున్నాయి నల్గొండ, ఖమ్మం అంటే ప్రాంతాలలో అత్యధికంగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది.
11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యం
గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు బద్దలు కొడుతూ ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తుంది. 11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి కూడా జనాలు ఉదయం లేదా సాయంత్రం బయటకు వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి.

ఈ జిల్లాలు రెడ్ జోన్ లో
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, జనగామ, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్ లో ఉన్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఈ జిల్లాలను 46 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణాలోని 13 జిల్లాలలో తీవ్రమైన వడగాలులు
ఇక రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణాలోని 13 జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అంటున్నారు. హనమకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి, గద్వాల్, నారాయణ పేట్,నాగర్ కర్నూల్ జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రమాదం ఉందన్నారు.
నల్గొండలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6డిగ్రీలఉష్ణోగ్రత
ఇక ఇదే సమయంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే ఆరవ తేదీ వరకు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాలో వరుసగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలోని చండూరు, మునుగోడు మండలాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు, వడగాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఉదయం 8గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో పాటు వడగాల్పులు వీస్తుండటం తో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు... కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగి పోవడంతో రాతి వేళల్లో కూడా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications