పండుగ చేసుకునే వార్త: వారి ఖాతాల్లో ఉచితంగా లక్ష రూపాయలు.. తులం బంగారం కూడా!!
తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఓ పథకం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధులను కూడా మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామందికి సంతోషం కలుగుతుంది. అసలు ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? దేనికి సంబంధించి నిధులను మంజూరు చేసింది? దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలలోకి వెళితే..
725 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ పథకానికి నిధులను మంజూరు చేసింది. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి 725 కోట్ల రూపాయలకు అనుమతినిచ్చింది ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీ అయిన కళ్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీంను అమలు చేయాలని నిర్ణయించింది.

గత ఎన్నికల ముందు ఆర్ధిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామన్న సర్కార్
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేసింది. ఇక ఈ హామీని అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశం మీద సుదీర్ఘంగా కసరత్తు చేసిన కాంగ్రెస్ సర్కార్ మొత్తం 725 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దీనివల్ల లబ్ధిదారులకు డబ్బుతో పాటు బంగారం కూడా లభించనుంది.
తెలంగాణాలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చటమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.
త్వరలోనే లబ్దిదారులకు గుడ్ న్యూస్
అంతే కాదు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి గూడు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారాన్ని ఉచితంగా లబ్ధిదారులకు అందించనుంది.
-
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications