వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. కేంద్రం నుండి ఏడాదికి రూ.12 లక్షలు
తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉద్యోగులు అంతా తల్లిదండ్రులను చూడాలని, లేదంటే వారి జీతంలో కోత విధించి ఆ డబ్బు తల్లిదండ్రులకు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇక తాజాగా వృద్ధుల కోసం 'ప్రణామ్ డే కేర్ సెంటర్లు' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణా సర్కార్ ప్రారంభించింది.
వృద్ధుల కోసం ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఈ కేంద్రాలు ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇక్కడ వృద్ధులకు వారానికి ఒక్కసారి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు. వీరి మానసిక శారీరక ఆరోగ్యానికి ఈ డే కేర్ సెంటర్లు దోహదం చేస్తాయి. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జనవరి 12న ఈ కేంద్రాలను లాంచనంగా ప్రారంభించారు.

సీనియర్ సిటిజన్ ల సంక్షేమం కోసం డే కేర్ సెంటర్లు
వృద్ధాప్యంలో నిరాదరణకు గురి కాకుండా, వృద్ధులలో సామాజిక సంబంధాలను పెంపొందించడం ద్వారా వారి మానసిక ఆరోగ్యానికి, శ్రేయస్సుకు దోహదపడటంకోసం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ఒంటరితనంతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు ఇవి ఎంతో ఉపశమనాన్ని, మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒంటరిగా ఉండే వృద్ధులు ఒకరికి ఒకరు సాయంగా, స్నేహభావంతో ఉండేలా ఈ డే కేర్ సెంటర్లు ఉపయోగపడతాయి.
వృద్ధులకు పౌష్టికాహారం కూడా
అంతేకాదు ఈ సెంటర్స్ ద్వారా ప్రభుత్వం . రోజుకు ఒకసారి వృద్ధులకు ప్రాథమిక పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 37 ప్రణామ్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి ఆమోదం తెలిపింది. వీటిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ ఉంటుంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో మాత్రం రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
కేంద్రాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిధులు
వచ్చే వారం నాటికి ఈ కేంద్రాలకు సంబంధించిన అన్ని వనరులు పూర్తిగా సిద్ధమవుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్కు సంవత్సరానికి సుమారు రూ.12 లక్షల రూపాయలను కేటాయించింది. ఈ నిధులు ప్రతి సంవత్సరం విడుదల అవుతాయి. వృద్ధుల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆసుపత్రులలోని జెరియాట్రిక్ వార్డులతో కేంద్రాలను అనుసంధానం చేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
60 ఏళ్లు పైబడిన వారికి సేవలు
60 ఏళ్లు పైబడిన వారు ఈ సెంటర్లలో నమోదు చేసుకుని సేవలు పొందవచ్చు.ఈ కేంద్రాల్లో మధ్యాహ్నం వేడి భోజనంతో పాటు, పుస్తకాల కోసం లైబ్రరీ, ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన కంప్యూటర్ సౌకర్యం ఉంటుంది. ఇండోర్ క్రీడలు, వైద్య సేవలు, వారానికి ఒకసారి ప్రాథమిక వైద్య తనిఖీలు సైతం అందిస్తారు. వారికి గార్డెనింగ్, మొక్కల పెంపకం వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
-
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications