దేవేందర్తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?
హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్రెడ్డి అభిప్రాయభేదాలు మరచి .. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు.
దేవేందర్ గౌడ్ మంతనాలు
శనివారం టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఇదివరకు వీరిద్దరూ టీడీపీలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం రేవంత్, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. తన విజయం కోసం నేతల మద్దతు కూడగట్టడంలో బీజీగా ఉన్నారాయన. ఈ క్రమంలోనే ఇవాళ దేవందర్ గౌడ్ ను కలిసి .. తనకు మద్దతు తెలుపాలని కోరినట్టు తెలుస్తోంది.

మద్దతుతో గెలుపు సునాయసం
వివిధ పార్టీ పెద్దల మద్దతు తీసుకుంటే .. టీఆర్ఎస్ పార్టీని ఓడించడం సులువవుతోందన్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే దేవేందర్ గౌడ్ ను కలిసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కూడా కలిసినట్టు పేర్కొన్నారాయన.
అంతా సానుకూలమే ..
లోక్సభ ఎన్నికల్లో మద్దతు కోసం కలిసిన నేతలంతా తనకు మద్దతు తెలిపినట్టు రేవంత్ పేర్కొన్నారు. వీరి మద్దతు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురేస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications