'ఉచ్చు బిగిస్తుందననే కేసీఆర్ అలా!.. ఆధారాలున్నాయ్, బయటపెడుతా..'
గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న డబుల్ బెడ్ రూమ్ పథకంలో అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గత కొద్దికాలంగా ఆరోపణలు చేస్తున్నారు.
రేవంత్ ఆరోపణలను గృహ నిర్మాణ శాఖ ఇంద్రకరణ్ తిప్పికొట్టినా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా శనివారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్ గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలకు, అవినీతికి కొమ్ముకాయొద్దని రేవంత్ అధికారులను హెచ్చరించారు. కేసీఆర్ తన మెడకు ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతోనే విజిలెన్స్ నివేదికలను తొక్కి పెడుతున్నారని ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాఖలో జరుగుతున్న అవినీతిని త్వరలోనే బయటపెడుతానని రేవంత్ చెప్పుకొచ్చారు. కాగా, గృహ నిర్మాణ శాఖలో అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇదివరకే సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications