తెలంగాణలో భారీ విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడితో రేవంత్ కీలక భేటీ
తెలంగాణలో భారీ విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటోన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా, అత్యాధునిక సౌకర్యాలతో మరో మూడు ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. వాటి నిర్మాణ పనులను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. దీనికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దేశ రాజధానిలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఎంపీ మల్లు రవి, రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఉన్నారు. వరంగల్ సమీపంలో నిర్మితమౌతోన్న మామునూర్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయల బ్లూ ప్రింట్స్, ఇతర ప్రతిపాదనలు అందజేశారు.

భూసేకరణ పూర్తయినందున మామునూర్ విమానాశ్రయానికి అవసరమైన పనులను ప్రారంభించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రిని కోరారు. అలాగే- ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయానికి అబ్ స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేసెస్ (OLS) సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపునకు పాలనాపరమైన ఆమోదం తెలిపామనీ అన్నారు.
దీనికోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కోసం పాల్వంచ అంతర్గామ్ వద్ద భూమిని గుర్తించామని రామ్మోహన్ నాయుడికి వివరించారు. దీనికి ప్రత్యామ్నాయ స్థలానికి తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం కేంద్రానికి అదనంగా 249.82 ఎకరాలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. దీని ప్రకారం- ఇక్కడ మూడు కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మిస్తారు. విమానాశ్రయానికి ఒకవైపు పౌర టెర్మినల్, మరోవైపు ఐఏఎఫ్ స్టేషన్ ఉంటాయి. ఇది పౌర విమానాల రాకపోకలు సాగించడానికి, భారత వైమానిక దళం స్టేషన్ రూపంలో జాయింట్ గా పనిచేస్తుంది. గతంలోనే ఈ ప్రతిపాదనకు ఐఏఎఫ్ అంగీకరించింది. ఎన్ఓసీ కూడా జారీ చేసింది. ఫలితంగా విమానాశ్రయం డెవలప్మెంట్ కు మార్గం ఏర్పడింది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications