భువనేశ్వరి వద్దకు రేవంత్ సతీమణి: ఆరా తీసిన లోకేష్, ధైర్యం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు, యువనేత రేవంత్ రెడ్డి సతీమణి గీత బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని, తనయుడు నారా లోకేష్ను కలిశారు.
తన తనయ నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వారిని గీత ఆహ్వానించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, లోకేష్లు నిశ్చితార్థానికి జరుగుతున్న ఏర్పాట్ల పైన గీత నుండి ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారు గీతకు ధైర్యం చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డికి పార్టీ, తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అధైర్యపడకూడదని ఆమెకు సూచించారు.

కాగా, గురువారం నాడు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం జరగనుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ కేబినెట్, టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.
ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నామని భరోసా ఇచ్చేందుకు ఏపీ మంత్రులు, నేతలు, తెలంగాణ టీడీపీ ముఖ్యులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. మరోవైపు, కూతురు నిశ్చితార్థానికి రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications