కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ నిజాం.. ఖాసీం రజ్వీలా హరీశ్ రావు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు, షబ్బీర్ అలీ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు విస్తృతంగా తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ నిజాం.. హరీశ్ రావు ఖాసీంరజ్వీ..

కేసీఆర్ నిజాం.. హరీశ్ రావు ఖాసీంరజ్వీ..

నిజాం నవాబు ఆధిపత్యం కోసం రజాకార్లను నియమించుకున్నారన్న రేవంత్.. కేసీఆర్ నిజాం అయితే.. ఖాసీంరజ్వీ హరీశ్ రావు అని అన్నారు. తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్.. హరీశ్ రావును ఖాసీం రజ్వీ లెక్క మార్చేశారని రేవంత్ చెప్పుకొచ్చారు. హుజూరాబాద్‌లో వ్యాపారులను, నిరుద్యోగులను, ఫీల్డ్ అసిస్టెంట్లను హరీశ్ రావు బెదిరిస్తున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలకు తెరలేపి.. ఖాసీంరజ్వీని హరీశ్ రావు తలపిస్తున్నాడని రేవంత్ విమర్శించారు.

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: రేవంత్, పోలీసు శాఖలో స్పిట్

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: రేవంత్, పోలీసు శాఖలో స్పిట్

పోలీస్ శాఖలో స్పిట్ వచ్చిందని, పోలీసు శాఖ రెండుగా చీలిపోయిందని.. రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావుకి ప్రభుత్వం అప్పగించిన రెండు పనుల్లో రేవంత్, డీజీపీ ఫోన్ ట్యాప్ చేయడమే పని అని రేవంత్ ఆరోపించారు. రిటైర్డ్ అయిన డీఎస్పీ వేణఉగోపాల్ రావు వద్ద 32 మందితో నిఘా పెట్టారని, డీజీపీ మీద నర్సింగ్ రావుని నిఘా పెట్టారని అన్నారు.

డీజీపీ కూడా భయం భయంగా బతుకుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిఘా లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. రిటైర్డ్ అయిన కొందర్ని స్వంతంగా పెట్టి వ్యవస్థలను నడిపిస్తున్నారని అన్నారు. సిటీ చుట్టూ ముట్టు తన వారికే పోస్టింగులు వేశారని, పోలీసు శాఖలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉందన్నారు. ఏపీకి చెందిన కేసీఆర్ బంధువును డిప్యూటేషన్ మీద తెప్పించడం అవసరమా? అని రేవంత్ ప్రశ్నించారు.

కవితమ్మ బెంజక్ కారులో..: హరీశ్‌పై రేవంత్ ఫైర్

కవితమ్మ బెంజక్ కారులో..: హరీశ్‌పై రేవంత్ ఫైర్

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రాలేదని టీఆర్ఎస్ అంటుందని.. మరి కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. డ్రగ్స్, సుగంధాలపై సమీక్షలు, ఇక కేటీఆర్.. ప్లీనరీ పేరుతో వంటకాలు చేస్తున్నారన్నారు. ఇక కవితమ్మ.. బెంజ్ కారు.. బతుకమ్మతో బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ఆట, పాట అంటూ వ్యాఖ్యానించారు. ఖాసీంరజ్వీకి ఇక్కడ ఎదురువచ్చినోడి నాలుకలు కోస్తున్నరు.. నలుగురు నాలుగు తీర్లు ఉన్నారని విమర్శించారు. ప్రజల కోసం కోట్లాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బాగోగుల బాధ్యత తమదేనని.. ఎందుకంటే.. తెలంగాణ ఇచ్చి ంది తామేనని రేవంత్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Huzurabad Election : TRS, BJP కలిసి పనిచేస్తున్నాయి.. ఇవే కారణాలు!!
టీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా వలసలంటూ షబ్బీర్ అలీ సంచలనం

టీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా వలసలంటూ షబ్బీర్ అలీ సంచలనం

మరో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు, బీజేపీ నేతలు తమకు టచ్‌లో ఉన్నారని, హుజురాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు వస్తాయని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యే లు వెనక్కి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనకు, పీసీసీ చీఫ్‌కి టచ్‌లో ఉన్నారని షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు తనకు టచ్ లో ఉన్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనం తిరుగుబాటు తప్పదన్నారు. తన దృష్టిలో కేటీఆర్ ఓ బచ్చా అని, హుజూరాబాద్‌లో మొదట కొంత వెనకబడి ఉన్నా.. పుంజుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Revanth Reddy slams KCR and Harish Rao in Huzurabad bypoll campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X