వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీఆర్ఎస్ కు ఇదో గుణపాఠం, తీర్పును లెక్క చేయకపోతే పోరాటమే : రేవంత్
హైదరాబాద్ : భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో-123 ని హైకోర్టు కొట్టివేయడంతో.. హైకోర్టు తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఈ తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని అభివర్ఱించారు.
తాజా తీర్పు ద్వారా ప్రభుత్వ తప్పిదాన్ని హైకోర్టు చక్కదిద్దిందని.. ఒకవేళ హైకోర్టు తీర్పును లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు రేవంత్. న్యాయస్థానం తీర్పును తూచ తప్పకుండా ఆచరించాల్సిందేనని ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తే తామే పోరాటంలోకి దిగుతామని ప్రకటించారు రేవంత్.
Comments
trs govt revanth reddy highcourt mallanna sagar టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హైకోర్టు మల్లన్న సాగర్
English summary
TDP working president Revanth Reddy was warned TRS govt to follow the highcourt judgement. he said govt has the responsibility to follow the judgement
Story first published: Wednesday, August 3, 2016, 18:17 [IST]