పీవీపై టిఆర్ఎస్ ప్రశంసలు, ఏపీలోని బందర్లో తెలంగాణ నేత విగ్రహం
హైదరాబాద్/అమరావతి: భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు బుధవారం పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
పీవీ నరసింహారావు కుమారుడు రాజశ్వేర్ రావు తండ్రి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు.. ప్రధానిగా పీవీ అందించిన సేవలను కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని నడిపిన నాయకుడన్నారు.
పీవీ నర్సింహా రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కృష్ణా జిల్లాలో అన్నారు. మచిలీపట్నంలో బుధవారం పీవీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరకాల మాట్లాడుతూ... దేశానికి పీవీ చేసిన సేవలు ఎనలేవిని అన్నారు. ఆయనను తెలుగు ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకోవాలన్నారు.
పీవీపై టిఆర్ఎస్ ప్రశంసలు, ఏపీలోని బందర్లో తెలంగాణ నేత విగ్రహం
బుధవారం పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, టిఆర్ఎస్ నేతలు తదితరులు.
పీవీపై టిఆర్ఎస్ ప్రశంసలు, ఏపీలోని బందర్లో తెలంగాణ నేత విగ్రహం
బుధవారం
పీవీ
ఘాట్
వద్ద
నివాళులు
అర్పిస్తున్న
మంత్రులు
నాయిని
నర్సింహా
రెడ్డి,
తలసాని
శ్రీనివాస్
యాదవ్,
టిఆర్ఎస్
నేతలు
తదితరులు.
పీవీపై టిఆర్ఎస్ ప్రశంసలు, ఏపీలోని బందర్లో తెలంగాణ నేత విగ్రహం
బుధవారం పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు.
పీవీపై టిఆర్ఎస్ ప్రశంసలు, ఏపీలోని బందర్లో తెలంగాణ నేత విగ్రహం
బుధవారం పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు.