టిడిపికి మాజీ మంత్రి సమరసింహారెడ్డి రాజీనామా
ఆ సీటును బిజెపికి కేటాయిస్తున్నట్లు మాట వరుసకు కూడ సమరసింహారెడ్డితో చెప్పలేదు. దాంతో అలక వహించిన సమరసింహారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత ఐదు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ అధ్యక్షులకు పంపినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
అప్పట్లో పార్టీ నాయకులు ఇతర పార్టీలకు వలసలు పోతున్న సమంయలో తెలుగుదేశం పార్టీకి 2013లో సమరసింహారెడ్డి పార్టీలో చేరి కొంత ఉత్సాహాన్ని నింపారు. సుమారు నెల రోజులపాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్లినప్పటికి టికెట్ విషయంలో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది.
సమరసింహా రెడ్డి కాంగ్రెసు పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతూ వచ్చారు. పలు ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేసి అందరి మెప్పూ పొందారు.
మహబూబ్నగర్ జిల్లాలో తన సోదరుడు భరత్ సింహారెడ్డితో పాటు ఆయన సతీమణి డికె ఆరుణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమరసింహా రెడ్డి రాజకీయంగా దెబ్బ తింటూ వచ్చారు. ఆయన చాలా కాలంగా ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు.