Medaram: వరదలోనే మేడారం.. వైరల్ అవుతున్న వీడియోలు..
అసాధారణ వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పోర్లాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలకు వరద తాకిడి భారీగా ఉంది. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు నీటిలో ఉన్నాయి. అటు మేడారంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేడారం జలదిగ్భంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు, వరదలతో మేడారం అంతా నీరు వచ్చింది. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెలు నీటిలో మునిగిపోయాయి. అమ్మవార్ల ఆలయాల్లో మోకాళ్లలోతు వరకు నీరు ఉంది.
ఆలయాల బయట కూడా దయనీయంగా మారింది. ఆలయం బయట ఉన్న దుకాణాలు కూలిపోవడంతో పాటు అందులో ఉన్న పూజా సామగ్రి కొట్టుకుపోయింది. వరద తాకిడికి గుడిసెలు కొట్టుకుపోవడంతో అందులో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు. వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరదలో చిక్కుకున్న మేడారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు.

వరద నీటిలోనే నడుస్తూ ప్రజలను కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ ప్రజలను రక్షించాలని సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. సీతక్క కష్టంలో ఉన్న ప్రజల కోసం తిరుగుతుంటే.. కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇలా చేస్తున్నారని విమర్శించారు.
దొడ్ల, మల్యాల, కొండాయిలో వరదలో గల్లంతైన 8 మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వారి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సీతక్క బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వద్ద హెలికాప్టర్ ఉండి ఉంటే వారిని కాపాడుకునే వాళ్లమని సీతక్క ట్వీట్ చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications