మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలి: Padi Kaushik Reddy
వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతరలో జరిగిన సంఘటన, కరీంనగర్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. పోలీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, ఆ వివాదం క్రమంగా చట్టపరమైన చర్యలు, అధికారుల సంఘాల హెచ్చరికల దాకా చేరింది. పరిస్థితి ముదిరిన వేళ, కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారు.
పోలీసుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కౌశిక్రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. తాను కావాలని ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జాతర సందర్భంగా ఏర్పడిన ఒత్తిడి, ఉద్రిక్త పరిస్థితులే తన మాటల్లో తీవ్రతకు కారణమయ్యాయని తెలిపారు. పోలీసులంటే తనకు గౌరవమేనని, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదని చెప్పారు. అయితే, ఈ ఘటనను రాజకీయంగా వాడుకుని తనపై, తన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని కూడా ఆరోపించారు.

జాతర గద్దె వద్ద మొదలైన ఉద్రిక్తత
సమ్మక్క-సారలమ్మ జాతరలో తొలి కొబ్బరికాయ కొట్టే విషయంలో దళిత మహిళా సర్పంచికి అవమానం జరుగుతోందన్న ఆరోపణలతో కౌశిక్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నిరసనకు దిగారు. సమ్మక్క గద్దె వద్దకు చేరిన అనంతరం, మొదటి కొబ్బరికాయ తామే కొడతామని పట్టుబట్టారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయిస్తామని ప్రకటించారు.
భక్తులకు అంతరాయం కలుగుతుందని పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలని సూచించినా, ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, పోలీసులు ఆయనను, ఆయన సతీమణిని గద్దె ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
వివాదాస్పద వ్యాఖ్యలు... పోలీస్ స్టేషన్ వరకు
ఈ సంఘటన అనంతరం, ప్రజాప్రతినిధులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, పోలీసు అధికారులు హద్దులు దాటుతున్నారని కౌశిక్రెడ్డి ఆరోపణలు చేశారు. కొందరు అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో విషయం మరింత ముదిరింది. చివరకు పోలీసులు ఆయనను సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అంతకుముందు హుజూరాబాద్ నుంచి వీణవంకకు బయలుదేరిన సమయంలోనూ పోలీసులు కౌశిక్రెడ్డిని అడ్డుకున్నారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరిమిత వాహనాలకే అనుమతి ఉంటుందని అధికారులు చెప్పగా, ఆయన వాగ్వాదానికి దిగారు. ఆపై భార్య, కుమార్తెతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్రిక్తత పెరుగుతుండటంతో చివరికి నాలుగు వాహనాలకు అనుమతి ఇవ్వగా, ఆయన వీణవంకకు చేరుకున్నారు.
కేసులు నమోదు... ఐపీఎస్ సంఘం ఘాటు స్పందన
అనుమతి లేకుండా ఆందోళన చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై పాడి కౌశిక్రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసు అధికారులపై చేసిన ఆరోపణలు అనుచితమని పేర్కొంది. కరీంనగర్ సీపీతో పాటు పోలీసులకు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
క్షమాపణలతో ముగింపు... కానీ రాజకీయ వేడి తగ్గేదెప్పుడో?
వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కౌశిక్రెడ్డి క్షమాపణలు చెప్పడం ద్వారా కొంత శాంతి వాతావరణం ఏర్పడినప్పటికీ, రాజకీయంగా ఈ అంశం ఇంకా చల్లబడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తి, సంప్రదాయం, రాజకీయాలు కలిసిన ఈ ఘటన రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications