కెసిఆర్ మిషన్ భగీరథపై సాహూ ప్రశంసలు: పోలవరానికి బూర కొలికి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పాన్ని చూసి గర్వపడుతున్నామని కేంద్ర తాగునీటి కార్యదర్శి సత్యభ్రత సాహు అన్నారు. తాగునీటిపై సాహు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ర్టాల ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాహు - మిషన్ భగీరథపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అద్భుత పథకమని ఆయన అన్నారు. మిషన్ భగీరథపై దేశమంతా చర్చ జరుగుతోందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ సంకల్పాన్ని చూసి గర్వపడుతున్నామని, మిగతా రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా మిషన్ భగీరథ లక్ష్యం గొప్పదని నీతి అయోగ్ సలహాదారు అశోక్జైన్ అన్నారు.

ఇదిలావుటే, పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ కొలికి పెట్టారు. పోలవరం డిజైన్ను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారంనాడు ఆయన లోక్సభలో ఈ అంశంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం కాదని తెలిపారు.
డిజైన్ను మాత్రమే మార్చాలని కోరుతున్నామన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ర్టానికి నిధులు పెంచాలని కోరారు. గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తే లెఫ్ట్ టెర్రరిజంను అరికట్టవచ్చన్నారు. గ్రామీణ మహిళలు, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications