కిరణ్ రెడ్డి షాకింగ్, విభజనపై కోర్టుకు: పిటిషన్ స్వీకరణ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు సహా 24 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు, రాయపాటి సాంబశివ రావు సహా 100 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని పిటిషనర్ల తరఫు లాయర్ చెప్పారు.
పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను అన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్టు తెలిపింది.

కాగా, ఏపీ విభజన నేపథ్యంలో సమైక్య ఏపీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో తెరాస ప్రభుత్వం, ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా.. రెండున్నరేళ్ల తర్వాత మరోసారి విభజన అంశం ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications