పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం: ఛలో అసెంబ్లీలో ఉద్రిక్తత (పిక్చర్స్)
హైదరాబాద్: వరంగల్లో జరిగిన శృతి, విద్యాసాగర్ల ఎన్కౌంటర్కు నిరసనగా బుధవారం తెలంగాణలోని ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు దూసుకువచ్చిన రాజ్ కుమార్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
వెంటనే స్పందించిన పోలీసులు ఆత్మహత్యాయత్నం ప్రయత్నాన్ని అడ్డుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి హైదరాబాద్కు వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అరెస్టులు చేస్తున్నారు.

ఓయులో ఉద్రిక్తం
వరంగల్ జిల్లా, తాడ్వాయ్లో జరిగిన ఎన్కౌంటర్పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినీ, విద్యార్థులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు ఓయు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

ఓయులో ఉద్రిక్తం
వరంగల్ జిల్లా, తాడ్వాయ్లో జరిగిన ఎన్కౌంటర్పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఓయు నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు.

ఓయులో ఉద్రిక్తం
వరంగల్ జిల్లా, తాడ్వాయ్లో జరిగిన ఎన్కౌంటర్పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓయులో ఉద్రిక్తం
వరంగల్ జిల్లా, తాడ్వాయ్లో జరిగిన ఎన్కౌంటర్పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.

ఓయులో ఉద్రిక్తం
అసెంబ్లీ ముట్టడికి పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. కొంతమందిని గృహనిర్బంధం చేశారు.

ఓయులో ఉద్రిక్తం
అసెంబ్లీ ముట్టడికి పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు.

ఓయులో ఉద్రిక్తం
అసెంబ్లీ ముట్టడికి పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు.

ఓయులో ఉద్రిక్తం
అసెంబ్లీ ముట్టడికి పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు.
దీంతో పలు చోట్లు ఉద్రికపరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ మహిళా విద్యార్ధులంతా ఓయూ హాస్టల్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీగా వచ్చి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా కొంత మంది విద్యార్ధినిలు మాట్లాడుతూ శృతి, సాగర్లది బూటకపు ఎన్కౌంటర్ని ఆరోపించారు.
శృతి శరీరంపై యాసిడ్ పోసి చాలా దారుణంగా పోలీసులు హింసించి చంపారన్నారు. ఎంటెక్ అభ్యసించిన శృతికే అలా జరిగితే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. విద్యార్థుల శవాలపై కేసీఆర్ కూర్చొని పాలన చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
వరంగల్ జిల్లా, తాడ్వాయ్లో జరిగిన ఎన్కౌంటర్పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. కొంతమందిని గృహనిర్బంధం చేశారు.












Click it and Unblock the Notifications