మరో ప్రధాన ఎక్స్​ ప్రెస్ రైలు చర్లపల్లి నుంచే - వేళల మార్పు..!!

దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ ​కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో ప్రధాన రైలు రాకపోకల్లోనూ మార్పులు చేసారు. సికింద్రాబాద్ స్టేషనల్ లో ఆధునీక రణ పనులు జరుగుతుండటంతో రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. సికింద్రాబాద్ లో రైళ్ల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి టెర్మినల్​ను రైల్వేశాఖ సిద్ధం చేసింది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వెళ్లే మరో రైలుకు సంబంధించి ప్రకటన చేసారు.

తాజా మార్పులు
సికింద్రాబాద్‌-రేపల్లెమధ్య నడిచే(17645) ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరే టెర్మినల్‌ ఈ నెల 15 నుంచి చర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు చర్లపల్లి నుంచి ఇంతకు ముందు ప్రకటించిన సమయం మధ్యాహ్నం 1.30గంటలకు బదులు మధ్యాహ్నం ఒంటి గంటకు (అరగంట ముందుగా) బయల్దేరుతుందని వెల్లడించారు. ఈ మార్గంలో ఆగే ఇతర స్టేషన్లు/ వేళల్లో ఎటువంటి మార్పులేదని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా ఈ రైలు ఈ మార్గంలో కొనసాగు తోంది. తొలుత ప్యాసింజర్ రైలుగా ప్రారంభమై.. తరువాత ఎక్స్ ప్రెస్ గా మార్పు చేసారు. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఈ రైలును వినియోగిస్తారు.

scr-announces-secunderabad-repalle-train-to-run-from-cherlapalli-timings-change

చర్లపల్లి నుంచి
ఇప్పటికే పలు రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తున్నాయి. తిరుపతి-ఆదిలాబాద్​ కృష్ణా ఎక్స్​ప్రెస్ ​(17405) చర్లపల్లి టెర్మినల్​ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు బొల్లారం స్టేషన్​లో రాత్రి 9.14కి ఆగుతుంది. మళ్లీ ఆదిలాబాద్​ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17406) బొల్లారం స్టేషన్​కు ఉదయం 4.29 గంటలకు, చర్లపల్లికి 5.45 గంటలకు వస్తుంది. కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు (07446) ఉదయం చర్లపల్లి నుంచి 7.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లికి 9.15కి చేరుతుంది.

రైల్వే అధికారుల నిర్ణయం
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) లింగంపల్లి నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయ లుదేరి చర్లపల్లికి 7.30 గంటలకు చేరుతుంది. ఈ నిర్ణయం జులై 1 వరకు అమల్లో ఉంటుంది. కాజీపేట-హదాప్పర్​ ఎక్స్​ప్రెస్​(17014) చర్లపల్లికి రాత్రి 8.20 గంటలకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) చర్లపల్లికి తెల్లవారుజామున 3 గంటలకు చేరుతోంది. ఇక,లింగంపల్లి-విశాఖపట్టణం(12806) జన్మభూమి ఎక్స్​ప్రెస్​ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (12805) సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యే వరకూ ఈ నిర్ణయాలు అమల్లో ఉండనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+