తెలుగు ప్రజలకు గుడ్న్యూస్: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్లో కోచ్లు రెట్టింపు
హైదరాబాద్: తెలుగు ప్రజలకు మరో మంచి వార్త ఇది. సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందేభారత్(Vandebharat) ఎక్స్ప్రెస్ రైలుకు విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎనిమిది కోచ్లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్ రైలులో బోగీల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
తిరుమల భక్తులతో రైలులో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలులో బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను 16కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో 120-130 శాతం మేర ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఈ రైలులో వెళ్లాలనుకున్నా.. ప్రయాణించలేకపోతున్నారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను పిలిచి తిరుపతి వందేభారత్ రైలులో బోగీల సంఖ్యను పెంచే విషయంపై ఆరా తీశారు.
Gratitudes to Hon’ble PM Shri @narendramodi & Hon’ble Railway Minister Shri @AshwiniVaishnaw for accepting the request for extending coaches of Vande Bharat Express - Secunderabad Tirupati, from 8 to 16 given the growing pilgrims & passenger patronage for the train. pic.twitter.com/xBrjMqMof9
— G Kishan Reddy (@kishanreddybjp) May 9, 2023
ఈ క్రమంలోనే వందేభారత్ రైలుకు ఉన్న డిమాండ్ను వివరిస్తూ దక్షిణమధ్య రై్ల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కసరత్తులు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కోచ్లను రెట్టింపు చేసేందుకు అంగీకరించింది. దీంతో తిరుపతికి మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశం కలగనుంది. త్వరలోనే రెట్టింపు కోచ్లు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications