తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రూ. కోటి ఫైన్ !
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఓ పిటిషనర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 1 కోటి జరిమానా విధించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పిటిషనర్ హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించి అడ్డంగా బుక్ అయ్యాడు. హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉండగా.. ఆ విషయాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పిటిషనర్ వ్యవహారం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేసినందుకు రూ. కోటి జరిమానా విధించారు.













Click it and Unblock the Notifications