ఏడేళ్ళకే పోలీస్ అయిన మోహన్ సాయి!!
మోహన్ సాయి.. వయసు ఏడేళ్లు.. కానీ అతి చిన్న వయసులోనే పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ తో కలిసి ఒక కేసు గురించి సీరియస్ గా చర్చించాడు. ఇంతకీ మోహన్ సాయి ఎవరు? అతిపిన్న వయసులోనే అతను పోలీస్ ఎలా అయ్యాడు? అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మం, లక్ష్మీ దంపతుల కుమారుడు మోహన్ సాయి. ప్రస్తుతం ఇతను 4వ తరగతి చదువుతున్నాడు. అయితే మోహన్ సాయి చిరకాల కోరిక మాత్రం పోలీస్ కావడమే.. విధి ఆడిన వింత ఆటలో బాలుడు మోహన్ సాయి క్యాన్సర్ బారిన పడ్డాడు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఏడాదికాలంగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. ఏడాదిగా తల్లిదండ్రులు అక్కడే ఉండి కుమారుడికి చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందని పదే పదే చెబుతున్న కొడుకు కోరికను తీర్చడం కోసం తల్లిదండ్రులు మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారిని కలిసారు.
మోహన్ సాయి పరిస్థితి చూసి చలించిన వారంతా అతని కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది ద్వారా బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్ సాయి కోరికను తీర్చేందుకు పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బుజ్జి పోలీస్ మోహన్ సాయి ని తీసుకువచ్చారు.

యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్ సాయి కి డిటెక్ట్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్ల కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ పనితీరుపై ఆయనకు వివరించారు. ఈ విధంగా మోహన్ సాయి చిరకాల కోరిక తీర్చి పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications