కోరిక తీర్చుకునేందుకే: కామపిశాచి మధు షాకింగ్, 49వేల యువతుల లిస్ట్
హైదరాబాద్: కామపిశాచి మధు లీలలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అతని వద్ద దాదాపు 49వేల యువతుల డేటా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రతి రాత్రి పన్నెండు గంటల వరకు వర్క్ చేశాడని గుర్తించారు. ఆనందం కోసమే ఇదంతా చేశానని చెప్పిన అతనిలో పశ్చాత్తాపం కూడా కనిపించలేదంటున్నారు.
మిర్యాలగూడకు చెందిన ఎఫ్సీఐ మాజీ ఉద్యోగి మధు లీలలు చాలా బయటపడుతున్నాయి. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో యువతులను వలలో వేసుకున్న తీరు చూసి పోలీసులే కంగు తింటున్నారట. అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినప్పటికీ సగం జీతం వస్తుండటంతో దానితో యువతులకు గాలం వేస్తున్నాడని తెలుస్తోంది.
మధు జాబ్ కన్సల్టెన్సీ కార్యాలయం నాగోల్ ప్రాంతంలో ఉంది. ప్రతి రోజు ల్యాప్టాప్లో వివరాలు రిజిస్టర్ చేసేవాడు. అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇలాగే చేస్తుండేవాడు. అతని ల్యాప్టాప్లో, రిజిస్టర్లో పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లలోని యువతుల వివరాలు ఉండేవి.
రిజిస్టర్ ఎవరైనా చూస్తే తన విషయం బయటపడుతుందని ఎవరు వచ్చినా వాటిని మూసేసేవాడు. ఇలా అతడు 49వేల మంది యువతుల బయోడేటాను సేకరించినట్లుగా తెలుస్తోంది. వేర్వేరు పేర్లతో తీసుకున్న 19 సిమ్ల ద్వారా గాలం వేసేవాడు.
మరో షాకింగ్ విషయం ఏమంటే... ఇతడు తన కోరికలు తీర్చుకునేందుకు పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి మాట ఎత్తితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. తన బారిన పడిన యువతులు గర్భం ధరించకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు స్టాక్ ఉంచేవాడు.
ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందని యువతులు భావించడం వల్ల... అతడు మరింత రెచ్చిపోవడానికి కారణమైందని అంటున్నారు. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కూడా అతడిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని తెలుస్తోంది. తన కోరికలు తీర్చుకోవడానికే ఇలా చేశానని చెబుతున్నాడని తెలుస్తోంది.