అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటాం: కెసిఆర్కు షబ్బీర్ అలీ హెచ్చరిక
నిజామాబాద్/హైదరాబాద్: క్యాంపు రాజకీయాలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అధికార పార్టీని బుధవారం హెచ్చరించారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పారు.
తక్షణమే రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం కరవు పైన కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలైన తెలంగాణవాదులకు అన్యాయం జరిగిందన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. క్యాంప్ రాజకీయాలు చేస్తే తాము ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని చెప్పారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివెల్కు అనుమతి లేదు: డిజిపి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్కు అనుమతి లేదని డిజిపి అనురాగ్ శర్మ బుధవారం నాడు చెప్పారు. మావోయిస్టుల పైన తమ విధానం మారలేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించమని, కఠినంగా ఉంటామని చెప్పారు.
డిఎస్పీ ప్రమోషనల్ అక్రమాల పైన విచారణ జరుపుతామని చెప్పారు. పోలీసు నియామకాల్లో సంస్కరణలు తెస్తున్నామన్నారు. 5కె రన్ రద్దు చేస్తున్నామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications