వృద్ధుడి పైత్యం: మెట్రోలో అమ్మాయిల ఫొటోలు తీసి! షీటీమ్స్కి చిక్కాడు
హైదరాబాద్: ఓ 65ఏళ్ల వృద్ధుడు మెట్రో రైలులో ప్రయాణిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తనకు ఎదురుగా ఉన్న అమ్మాయిల ఫొటోలను వారికి తెలియకుండా తీశాడు. దీంతో అక్కడే ఉన్న షీటీమ్స్ అతడ్ని అరెస్ట్ చేసింది.
ఆ వివరాల్లోకి వెళితే.. నర్సింహ(నర్సయ్య)(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తూ.. తను ఎదురుగా ఉన్న అమ్మాయిల ఫోటోలను తన ఫొట్లో తీశాడు. దీంతో అక్కడే ఉన్న షీ టీమ్స్ అతడ్ని పట్టుకుని జైలుకు తరలించాయి.

కాగా, సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడని షీటీమ్స్ తెలిపాయి.
అంతేగాక, అతని ఫోన్ తనిఖీ చేయగా అప్పటికే ఆఫోన్లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయని తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications