ఆర్టీసీ బస్సులతో లక్షలు సంపాదిస్తున్న మహిళలు.. తగ్గేదేలే!
తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిని చూపించడంతో పాటు, ఏ రంగంలో అవకాశముంటే ఆ రంగంలో మహిళలు దూసుకు పోయేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం, మహిళలను లక్షాధికారులను చేస్తోంది.
మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇప్పించే వినూత్నకార్యక్రమం
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం వడ్డీలేని రుణాలతో మహిళా సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

బస్సుల అద్దెల డబ్బులు జమ చేయడంతో మహిళల ఆర్ధిక ప్రగతి
మహిళా సమాఖ్యల ద్వారా అద్దె బస్సులను కొనుగోలు చేయడం, వాటిని ఆర్టీసీకి హైర్ చేసి నడిపించడం, తద్వారా వచ్చిన డబ్బులను మండల మహిళా సమాఖ్యల ఖాతాలలో జమ చేయడం వంటి చర్యలతో మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మండల సమాఖ్యల ఖాతాలలో బస్సుల అద్దెల డబ్బులు జమ చేయడం ద్వారా ఈ మండల సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో 9 బస్సులు ఆర్టీసీకి అద్దెకు
ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలో తొమ్మిది మండల సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి 9 ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చాయి. మహబూబాబాద్ డిపోకు ఆరు బస్సులు, తొర్రూరు, నర్సంపేట, భూపాలపల్లి ఆర్టీసీ డిపోలకు ఒక్కొక్క బస్సు వీరు అద్దెకు ఇచ్చారు. 36 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ప్ అధికారులు ఆర్టీసీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని వారికి అప్పగించారు.
లక్షల ఆదాయం సంపాదిస్తున్న మహిళా సమాఖ్యలు
ఈ అద్దె బస్సుల ద్వారా మండల మహిళా సమాఖ్యలకు ఆదాయం సమకూరుతుంది. ప్రతి బస్సుకు ఆర్టీసీ నెలకు 69 వేల నాలుగు వందల రూపాయలు చొప్పున చెల్లిస్తోంది. బస్సుల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని సంఘ సభ్యులు తమ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ప్రస్తుతం వీరి 9 బస్సుల ద్వారా నెలకు ఆరు లక్షల 24 వేల 600 రూపాయల ఆదాయం వస్తుంది.
7 మండల సమాఖ్యల ద్వారా బస్సుల కొనుగోలు ప్రతిపాదనలు
ఈ విధంగా సంవత్సరానికి వీరికి 75 లక్షల రూపాయల ఆదాయం మహిళా సమాఖ్యల ఖాతాలలో జమ కానుంది. ఇప్పటికే గత ఎనిమిది నెలలుగా దాదాపు 50 లక్షల రూపాయల వరకు జమయ్యాయి. తాజాగా మరో 7 మండల సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే మరిన్ని మహిళా సమాఖ్యలకు ఆదాయం లభించే అవకాశం ఉంది.
-
Smart Nails : మీ డ్రస్సింగ్కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు".. -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications