సినీనటుడు శివాజీకి దుబాయ్లో చుక్కెదురు.. ఎయిర్పోర్టులో ఆపేసిన అధికారులు
హైదరాబాద్ : సినీ నటుడు శివాజీకి దుబాయ్లో చుక్కెదురైంది. ఆయన అమెరికా వెళ్లేందుకు ఎయిర్ పోర్టు వద్దకు రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అలంద మీడియా కేసులో శివాజీపై అన్ని ఎయిర్ పోర్టుల్లో లుక్ ఔట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి స్వదేశం తిరిగొచ్చే అవకాశం ఉంది.

అలంద మీడియా వ్యవహారంలో శివాజీ ఏ2గా ఉన్నారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. అయితే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించి ఎయిర్ పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం దుబాయ్ వెళతానని కోరడంతో కోర్టు అంగీకరించింది. అక్కడినుంచి దొడ్డిదారిన అమెరికా వెళ్లాలని ప్రయత్నించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పడంతో శివాజీ ఖంగుతిన్నారు. అయితే ఇటీవల శివాజీ అమెరికా వెళ్లడం చర్చానీయాంశమవుతుంది. ఆయన ఎందుకు వెళ్తున్నారు ? ఏం చేస్తున్నారనే అంశం చర్చకు దారితీసింది.
లుక్ ఔట్ నోటీసులు ఉన్న శివాజీ తిన్నగా ఇండియా రాకుండా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనిని ఎయిర్ పోర్టులో అధికారులు ఆపినట్టు తెలుస్తోంది. తిరిగి ఇండియా వెళ్లిపోవాలని స్పష్టంచేసినట్టు సమాచారం. దీంతో ఆయన హైదరాబాద్ అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ దుబాయ్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు మాత్రం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించే పరిస్థితి లేదని తెలుస్తోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications