హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఎమ్మెల్సీ కవితకు తలనొప్పిగా తయారైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో మొదలైన దుమారం నేటికీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ దాడులు కొనసాగిస్తున్న తీరు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానాలకు కారణంగా మారింది. ఇక తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ లింకులపై మళ్ళీ బాంబు పేల్చిన బీజేపీ; రాజకీయవర్గాలలో ఆసక్తి!!ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ లింకులపై మళ్ళీ బాంబు పేల్చిన బీజేపీ; రాజకీయవర్గాలలో ఆసక్తి!!

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాకిచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు అందజేసింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్వారంటైన్ లో ఉన్నారు. ఈ కారణంగా కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గతంలో కవిత పీఏగా పనిచేసిన వ్యక్తి అభిషేక్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించింది. నేడు కవిత అకౌంటెంట్ గా పనిచేసిన వ్యక్తి గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది.

 కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు

కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు


హైదరాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో పలువురు వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్ లు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చి బాబు నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని దోమలగూడలో అరవింద నగర్ శ్రీ సాయి క్రిష్ణ రెసిడెన్సిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత పీఏగా పని చేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం తెలిసిందే.

హైదరాబాద్ లో మళ్ళీ ఈడీ సోదాలు.. 25 చోట్ల కొనసాగుతున్న తనిఖీలు

హైదరాబాద్ లో మళ్ళీ ఈడీ సోదాలు.. 25 చోట్ల కొనసాగుతున్న తనిఖీలు


ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాదు లింకులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వాటిని కోర్టుకు అందజేస్తామని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్లో ఇరవై ఐదు చోట్ల ఈడి అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ హైదరాబాద్లో రెండు సార్లు తనిఖీలు చేపట్టగా, తాజాగా మరోమారు రాబిన్ డిస్టిలరీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహిస్తున్న రామచంద్ర పిళ్ళై నివాసంతో పాటు, ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న అభిషేక్ రావు, ప్రేమసాగర్ రావు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

English summary
ED issues notices to TRS MLC Kalvakuntla Kavitha in Delhi liquor scam. MLC Kalvakuntla Kavitha is currently in quarantine due to corona. For this reason, ED issued notices to Kavitha's assistants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X