తనకు, తన కుటుంబానికి ప్రాణహాని: పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఫిర్యాదు
సింగర్ సునీతను పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ వీరపనేని వార్తల్లో వ్యక్తి అయ్యారు. సింగర్ గా సునీతకు ఉన్న పాపులారిటీతో, ఆమెను వివాహమాడిన తర్వాత రామ్ వీరపనేని పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ సమయంలో తాజాగా ఆయన తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఓ వ్యక్తి నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ప్రముఖ గాయని సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారా హిల్స్ నెంబర్ 2 లో ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో నివసించే రామకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి వేధిస్తున్నాడు.

కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి సినీ నిర్మాతల సభ్యుడిని చెబుతూ తరచూ తనకు ఫోన్లు చేస్తున్నాడని, అర్జెంటుగా మాట్లాడాలి అని పిలుస్తున్నాడు అని సునీత భర్త రామకృష్ణ వీరపనేని ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా కలవాలని కోరగా, అతడిని కలవడం తనకు ఇష్టం లేకపోవడంతో కలవలేదని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.
పదే పదే విసిగిస్తూ ఉండటంతో తన నెంబర్ బ్లాక్ చేసిన ఆయన, అయినప్పటికీ మరో కొత్త నెంబర్ నుంచి సదరు వ్యక్తి కాల్ చేస్తూ, మెసేజ్ లు పెడుతూ, ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని కోరారని పోలీసులు తెలిపారు.
రామ్ వీరపనేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదు చేయడంతో సింగర్ సునీత విషయంలో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అతను సునీత భర్తను ఎందుకు బెదిరిస్తున్నాడు? అతనికి, రామ్ వీరపనేనికి మధ్య గొడవ ఏమిటి అని చర్చిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications