టీఎస్పీఎస్సీ ఛైర్మన్ను ప్రశ్నించిన సిట్, కీలక వాంగ్మూలం: మరో ముగ్గురి కస్టడీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పేపర్ లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని సిట్ విచారించింది. దాదాపు 3 గంటలపాటు ఆయనను విచారించి కీలక విషయాలను నమోదు చేసుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆయనను పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి నిందితులు లాగిన్ ఐడీ, పాస్వర్డ్, తస్కరించడం నుంచి ప్రశ్నపత్రాల లీక్ వరకు జరిగిన పరిణామాలపై ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కమిషన్లో పనిచేసే ఉద్యోగుల విధి విధానాలు, ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం, పరీక్షలు నిర్వహించే తీరు, దానికి అనుసరించే పద్ధతులపై ఆరా తీసినట్లు తెలిసింది. పేపర్ లీకేజీ నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్లు ఆఫీస్లో చేసిన పని తీరు గురించి ఛైర్మెన్ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా, ప్రవీణ్ , రాజశేఖర్ల ల్యాప్టాప్ సమాచారాన్ని సిట్ మరోసారి పరిశీలించింది.

మరోవైపు, ఈ లీకేజీ కేసులో నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించింది. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు వారిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ముగ్గుర్ని మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని ఏప్రిల్ 6 వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు.
ఇదే కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీలోకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు. ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో ఇటీవల ఆరెస్ట్ అయినా ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్య ను కస్టడీకి అనుమతిచ్చింది. ఏప్రిల్ 4న ఉదయం చంచల్ గూడా జైలు నుండి ముగ్గురు నిందితులను కస్టడీ లోకి తీసుకోనుంది సిట్.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications