తల్లి అక్రమ సంబంధం: దగ్గరుండి ప్రియుడితో కొడుకుని కొట్టించింది
హైదరాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ కారు డ్రైవర్ ఆరేళ్ల బాలుడిని చితకబాదాడు. అతను ఎలక్ట్రిక్ వైర్తో ఆ బాలుడిని బాదుతుంటే బాలుడి తల్లి ప్రియుడికి సహకరించింది. దగ్గరుండి ప్రియుడితో తన కుమారుడిని కొట్టించింది.
స్థానికులు స్పందించి దేహశుద్ధి చేసిన డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన హైదరాబాదులోని సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీనగర్ బబ్బుగుడాలో జరిగింది.

ఒకటో తరగతి చదువుతున్నాడు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ తన భర్త మరణించడంతో ఉపాధి కోసం హైదరాబాదు వచ్చింది. మోతీనగర్ ప్రాంతంలోని బబ్బుగుడాలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ వస్తోంది. జయమ్మకు పవన్ కుమార్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.

కారు డ్రైవర్తో ఆమెకు సంబంధం
జయమ్మకు స్థానికంగా ఉండే కారు డ్రైవర్ పెద్దిరాజుతో ఏడాది క్రితం పరిచయమైంది. ఆ తర్వాత సహజీవనం చేస్తూ వచ్చారు. కొడుకును వదిలించుకోవాలని పెద్దిరాజు జయమ్మతో పోరు పెడుతూ వచ్చాు. దానికి తోడు చిన్న చిన్న సాకులు చూపి అతన్ని కొడుతూ ఉండేవాడు.

ఆ రోజు ఇలా కొట్టాడు...
అల్లరి చేస్తున్నాడనే సాకుతో సోమవారంనాడు ప్లాస్టిక్ వైర్ తీసుకుని పెద్దిరాజు బాలుడిని తీవ్రంగా కొట్టాడు. బాలుడి వీపు, చేతులు కాళ్లపై తీవ్రంగా కొట్టాడు. దీంతో వాతలు తేలాయి. బాధ భరించలేక బాలుడు కేకలు వేశాడు.

బాలుడి కేకలతో...
బాలుడి కేకలు విని స్థానికులు వచ్చారు. బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు సహకారంతో బస్తీవాసులు పెద్దిరాజుకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సనత్నగర్ పోలీసులకు అప్పగించారు. వెంకటేశ్వర రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications