ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి 58 రోజులైంది. గత 58 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ లోపల ఎనిమిది మంది చిక్కుకోగా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన బృందాలు రెండు మృతదేహాలను వెలికి తీయగలిగాయి. మిగతా ఆరుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగింది.
షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యం
58 రోజులపాటు తవ్వకాలు జరిపినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. దీంతో రెస్క్యూ బృందాలు షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యమని చెబుతున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. నోగో జోన్లో తవ్వకాలు తెలిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ లో 12 సంస్థల బృందాలు
ఎనిమిది రోజులుగా సుదీర్ఘంగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో కేవలం రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. మార్చి 9వ తేదీన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22వ తేదీన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకు రాగలిగారు. మొత్తం దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు ప్రయత్నం చేసిన ఫలితం మాత్రం రాలేదు.
ఇప్పటివరకు దొరకని మరో ఆరుగురి ఆచూకీ
హైడ్రా, సింగరేణి, ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా నిపుణులైన వారంతా రంగంలోకి దిగిన మరో ఆరుగురి ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.
టన్నెల్ లోపల 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. ఇక టన్నెల్ లోపల 43 మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించి అక్కడకు ఎవరు వెళ్లకూడదని నిషేధ ప్రాంతంగా సూచించారు.
డేంజర్ జోన్ లో పనులు చెయ్యాలంటే మరింత సమయం
ఈ జోన్ కు సమీపంలోనే సహాయక చర్యలను నిర్వహించారు. అయితే డేంజర్ జోన్లో సహాయక చర్యలను నిర్వహించడం అంత ఈజీ కాదని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. ఈ జోన్ కు సమీపంలో భారీగా వస్తున్న నీళ్లను మోటార్లతో తోడుతున్నారు. అయితే ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లేనని, డేంజర్ జోన్లో పనులు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications