SLBC టన్నెల్ ప్రమాదం.. రోబోలతో గాలిస్తున్నా.. తాజా పరిస్థితి ఇదే!
ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నేటితో ఈ రెస్క్యూ ఆపరేషన్ కు 22వ రోజు. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియలేదు.
టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
21 రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీ ల సహాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కు మరో రెండు రోజులు పట్టే అవకాశం
ఇప్పటికే టన్నెల్లోకి పంపిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్పి సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన యంత్రాన్ని సహాయక చర్యల కోసం శుక్రవారం సొరంగంలోకి పంపారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు మట్టిని వేగంగా సమర్థవంతంగా తొలగిస్తాయని భావిస్తున్నారు.
మట్టిని తొలగించే పనిలో రెస్క్యూ బృందాలు
డి1, డి2 ల వద్ద ఇప్పటికే సింగరేణి హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు నాలుగు మీటర్ల లోతులో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేసి బయటకు తరలిస్తున్న క్రమంలో లోపల రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా నడుస్తుంది. కార్మికులు తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు పొక్లెయినర్ సహాయంతో బయటకు తెస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం
ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసుకురాగా, ఇంకా 6 మృతదేహాలను గుర్తించవలసి ఉంది. గత 22 రోజులుగా కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఇంకా మృతదేహాలను బయటకు తెచ్చి కుటుంబ సభ్యులకి అందించలేకపోయారు. అయితే మరో రెండు రోజుల్లో మిగతా ఆరుగురు మృతదేహాలను కూడా వెలికి తీస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications