రాజీ పడొద్దు: మండుటెండలో నిచ్చెనెక్కిన స్మితా సబర్వాల్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సింగూర్ ప్రాజెక్టులో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎంఓ కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ మంగళవారం సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సింగూర్ డ్యాం అంతర్భాగంలో కుడి ఎడమ వైపు జరుగుతున్న పనులను ఒప్పందం ప్రకారం 2017 ఫిబ్రవరికి పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎస్ఈ విజయ్ ప్రకాశ్ స్మితాసబర్వాల్కు వివరించారు. అయితే అధికారులు మాత్రం దసరా లోపు పూర్తి చేయమని కోరుతున్నారని ఆయన తెలిపారు.
ట్రయల్ రన్ ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే పైప్లైన్ పనులు 8 0శాతం పూర్తి అయ్యాయని కన్స్ట్రక్షన్ పనులు నాణ్యతతో పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కాగా, సింగూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని మెదక్, నిజమాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాలకు అందించటానికి ప్రణాళికలు రూపొందించించారు.
ఆ దిశగా అక్కడ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పది నియోజక వర్గాలకు నీటిని సరఫరా చేయటానికి ఇంటెక్వెల్లను నిర్మిస్తున్నారు. వీటిని మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు, కలెక్టర్ రోనాల్ట్ రోస్, నిజామాబాద్ కలెక్టర్ యోగితారానా పరిశీలించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
ఈ సందర్భంగా సింగూర్ డ్యాం అంతర్భాగంలో కుడి ఎడమ వైపు జరుగుతున్న పనులను ఒప్పందం ప్రకారం 2017 ఫిబ్రవరికి పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎస్ఈ విజయ్ ప్రకాశ్ స్మితాసబర్వాల్కు వివరించారు. అయితే అధికారులు మాత్రం దసరా లోపు పూర్తి చేయమని కోరుతున్నారని ఆయన తెలిపారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
ట్రయల్ రన్ ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే పైప్లైన్ పనులు 8 0శాతం పూర్తి అయ్యాయని కన్స్ట్రక్షన్ పనులు నాణ్యతతో పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
కాగా, సింగూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని మెదక్, నిజమాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాలకు అందించటానికి ప్రణాళికలు రూపొందించించారు. ఆ దిశగా అక్కడ పనులు చేపడుతున్నారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
ఇందులో భాగంగా పది నియోజక వర్గాలకు నీటిని సరఫరా చేయటానికి ఇంటెక్వెల్లను నిర్మిస్తున్నారు. వీటిని మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు, కలెక్టర్ రోనాల్ట్ రోస్, నిజామాబాద్ కలెక్టర్ యోగితారానా పరిశీలించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
జిల్లాలో అందోల్, నారాయణఖేడ్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజక వర్గాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులకు ఆమె సూచించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
మిషన్ భగీరథ ఎస్ఈ విజయ్ ప్రకాశ్ పనుల జరుగుతున్న తీరును స్మితాసబర్వాల్కు వివరించారు. సింగూర్ డ్యాం లోని పెద్దారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, పైప్లైన్లు మొత్తం రూ. 2 వేల కోట్లతో పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
అందోల్, మెదక్, నారాయణ ఖేడ్ నియోజక వర్గాలకు రూ.750 కోట్లతో పనులు జరుగుతున్నాయని, నిజమాబాద్ జిల్లాలోని బాన్సువాడ,ఎల్లారెడ్డి, బోధన్, జుక్కల్ లోని 16 మండలాలకు రూ. 13 వందల కోట్లతో పనులు ప్రారంభించామని ఆయన వివరించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
అనంతరం నీటి శుద్ధి జరిగే క్లారీఫయర్ కేంద్రం వద్ద జరుగుతున్నా పనులను సెంట్రింగ్తో నిర్మించిన ఎత్తుపైకెక్కి పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి నీరు ఎంత సరఫరా జరుగుతుందోనని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయిపాడ్లో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ట్యాంక్లను ఆమె పరిశీలించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
ట్యాంక్ల నిర్మాణానికి 4 ఎకరాల భూమిని ఇచ్చిన రైతు చాకలి యాదమ్మ తమ కుమారుడికి మిషన్ భగీరథలో ఉద్యోగం ఇప్పించాలని కోరగా కలెక్టర్ రోనాల్డ్ రోస్కు ఉపాధి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

మండుటెండలో గొడుగు నీడలో స్మితా సబర్వాల్
ఈ కార్యక్రమంలో స్మితా సబర్వాల్ వెంట జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, నిజమాబాద్ జిల్లా కలెక్టర్ యాగితారానా, ఆర్డబ్ల్యూఎస్ శాఖ జిల్లా ఎస్ఈ విజయ్ ప్రకాశ్, కన్స్ట్రక్షన్ ఈఈ చౌదరి, పుల్కల్ ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు,ఆర్ఐ సుకుమారి ఎస్ఐ సత్య నారాయణ లున్నారు.












Click it and Unblock the Notifications