200మందితో చాటింగ్: తెలియని వ్యక్తులతో వద్దు, అమ్మాయి అనుకొని యాక్సెప్ట్ చేశా!
హైదరాబాద్: 200 మందితో చాటింగ్ చేస్తూ, పలువురిని.. నగ్న చిత్రాలు నెట్లో పెడతానని బెదిరించిన అబ్దుల్ మాజిద్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతని నెంబర్ షేర్ చేయడమే కొంప ముంచిందంటున్నారు. ఈ ఘటన ద్వారా తెలియని వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ వద్దని సూచిస్తున్నారు.
అబ్దుల్ మాజిద్ బారిన చాలామంది అమ్మాయిలు పడ్డారు. అయితే, వారంతా భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. అయితే, ఓ విద్యార్థిని తన తల్లికి విషయం చెప్పింది. ఆ తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగు చూసింది.
ఆ తల్లీ, అమ్మాయి మాట్లాడుతూ... ఇంటర్నెట్ ద్వారా తెలియని వ్యక్తులతో ప్రెండ్ షిప్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటివి వద్దని సూచించారు.
తన కూతురు తనకు మాజిద్ వేధింపుల విషయం చెప్పిందని, దీంతో తాము చాలా ఆందోళన చెందామని, ఆ తర్వాత ధైర్యం చేసి పోలీసులకు కాల్ చేశామన్నారు. తమకు కమిషనర్ సహకరించారని చెప్పారు. వెంటనే అతనిని ట్రాప్ చేసి పట్టుకున్నారన్నారు.
ఈ విషయమై తమకు మూడు రోజుల పాటు తిండి, నిద్ర లేక ఆందోళన చెందామన్నారు. బాగా భయపడ్డామని చెప్పారు. మానసిక వేధన చెప్పలేమన్నారు.

అమ్మాయి మాట్లాడుతూ... తనకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులు 5 మాత్రమే అని చెప్పారు. మాజిద్ ప్రొఫైల్ చూసి అమ్మాయి అనుకోని యాక్సెప్ట్ చేశానని చెప్పారు.
ఆ తర్వాత తనకు మెసేజ్ పెట్టారని, నీకు సహకరించేందుకు ఓ విషయం చెబుతున్నానని, నీ పిక్చర్స్ ఒకరి వద్ద ఉన్నాయని, వాటిని తనకు పంపించాలని చెప్పాడని, అయితే, తాను అలాంటి పిక్చర్స్ ఎప్పుడు పంపించలేదని, అందుకే తాను ధైర్యంగా ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పానన్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సంఘటన రోజు తాము ఎంతో మానసిక వేదన అనుభవించామన్నారు.
ఈ సంఘటన ఇంత పెద్ద అంశం అవుతుందని తాను భావించలేదని బాధిత అమ్మాయి చెప్పారు. అన్ నోన్ (తెలియని వారు) నెట్లో రిక్వెస్ట్ చేస్తే ఏం తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేయడం మంచిది కాదని చెప్పారు. తనకు తన కుటుంబం మంచి మద్దతు ఇచ్చిందన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications