హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రైవర్ తొందరపాటు, టెక్కీ చెవిలో ఇయర్ ఫోన్స్: బస్సు చక్రం కిందపడి టెక్కీ శిరీష మృతి

బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా టెక్కీ బుధవారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా టెక్కీ బుధవారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

Recommended Video

టెక్కీ శిరీష ప్రమాదం : సీసీటీవీ ఫుటేజీ | Oneindia Telugu

మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి సస్పెన్షన్మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి సస్పెన్షన్

 స్పిన్ఎస్సీఐలో పని చేస్తున్న శిరీష

స్పిన్ఎస్సీఐలో పని చేస్తున్న శిరీష

గాజుల రామారానికి చెందిన ఇరవై అయిదేళ్ల శిరీష బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 12లోని స్పిన్‌ఎస్‌సీఐ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో వచ్చారు. బంజారాహిల్స్‌ పెన్షన్ ఆఫీస్ చౌరస్తా దిగారు. రోడ్డు దాటుతుండగా మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.

 అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు

అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు

అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై దయాకర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 డ్రైవర్ తొందరపాటు వల్లే

డ్రైవర్ తొందరపాటు వల్లే

ఆర్టీసీ డ్రైవర్ తొందరపాటు వల్ల ఆమె మృతి చెందినట్లుగా చెబుతున్నారు. రోడ్డు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా బస్సును నిర్లక్ష్యంగా నడిపారని చెబుతున్నారు. దానికి తోడు టెక్కీ శిరీష తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. దీంతో ఆమె బస్సు రాకను గమనించలేదు. బస్సు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.

 బస్సు చక్రం వెళ్లడంతో

బస్సు చక్రం వెళ్లడంతో

కిందపడిన ఆమె పై నుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతి చెందిన శిరీష నాలుగు నెలల గర్భిణీ.

 భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మహిళ

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మహిళ

శిరీష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంకు చెందిన వారు. ఆమె భర్త మురళీకృష్ణతో కలిసి గాజులరామారంలో నివసిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందారని స్థానికంగా ఉన్న వారు కూడా చెప్పారు.

English summary
A 25-year-old woman software engineer was crushed to death while crossing the road at busy Pension Office junction at Road No.1 and 12, Banjara Hills on Wednesday. Sirisha was working at SpinSci located on Road No. 12 in Banjara Hills as a software engineer. Recently got married, Shirisha lived at Khairatabad from where she was going to office when the accident happened. An RTC bus belonging to Mehdipatnam-1 depot knocked her down and the rear tyre crushed her killing her on the spot. As her head came under the tyres, her face was damaged beyond recognition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X