సలహాలిచ్చారు: దాసరిపై సోనియా గాంధీ, 'అమ్మ' కోరిక నెరవేరకుండానే..
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు దాసరి నారాయణ రావు మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతి తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు దాసరి నారాయణ రావు మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతి తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ప్రజాసేవ పట్ల ఆయనెంతో నిబద్ధతతో ఉండేవారని సోనియా కొనియాడారు. కేంద్రమంత్రిగా వివిధ చర్చల్లో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చేవారన్నారు.

పార్టీ గుర్తుంచుకుంటుంది
పార్లమెంటు సభ్యుడిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఆయన చేసిన సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందని సోనియా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, దాసరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

చివరి కోరిక నెరవేరకుండానే దాసరి..
దాసరి నారాయణ రావు తన చివరి కోరికను నెరవేర్చుకోకుండానే వెళ్లిపోయారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఓ చిత్రాన్ని తీయాలనుకున్నారు దాసరి. కానీ ఆ కోరిక నెరవేరకుండానే మృతి చెందారు.

అమ్మ అనే టైటిల్
జయలలిత మృతి తర్వాత ఆమె జీవిత చరిత్రలో తనకు తెలిసిన విషయాలతో పాటు, తెలియని విషయాల గురించి పలువురితో దాసరి చర్చలు కూడా జరిపారు. తాను నిర్మించ తలపెట్టిన జయలలిత బయోపిక్ కు 'అమ్మ' అన్న టైటిల్ను కూడా అనుకున్నారు.

పవన్ కళ్యాణ్తోను..
అదే సమయంలో పవన్ కళ్యాణ్తో కలసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని కూడా దాసరి భావించారు. ఓ సినిమా ఫంక్షన్లో ఇదే విషయాన్ని దాసరి చెప్పారు. దానికి పవన్ సైతం ఆయనతో తన చిత్రం తప్పకుండా ఉంటుందన్నారు. ఈ కోరికలు తీరకుండానే మృతి చెందారు.

ఆయనకిష్టమైన ఫాంలోనే..
దాసరి అంత్యక్రియలు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని ఆయన ఫాంహౌస్లో జరగనున్నాయి. 2011 అక్టోబర్ 28న దాసరి పద్మ కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా కుంగిపోయారని అంటారు. దాసరి అంత్యక్రియలు కూడా ఈ పాంహౌస్లోనే జరుగుతాయి. ఈ ఫాంహౌస్ అంటే ఆయనకు ఇష్టం.

చెన్నై ఆటో కార్మికులకు గౌరవం
ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహిస్తుండగా, ఆ భారం తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండే వారు. దాసరి దర్శకత్వం వహించిన శివరంజని, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా, మేఘసందేశం వంటి పలు చిత్రాలకు ఆమె నిర్మాతగా ఉన్నారు. సొంతడబ్బు ఖర్చు పెట్టి మరీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఆమె అంటే, చెన్నై ఆటో కార్మికుల సంఘానికి ఎంతో గౌరవం. ఆటో డ్రైవర్ కాకున్నా ఆ మంచిగుణమే పద్మను ఆటో సంఘానికి అధ్యక్షురాలిని చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications