ఈ రైళ్లకు ప్రయాణికులు ఊహించని రీతిలో సౌకర్యాలు
దూర ప్రాంతాల నుంచి వివిధ నగరాల మధ్య నడిచే ఇంటర్ సిటీ రైళ్ల వరకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయా? లేదంటే ఆ తర్వాత కూడా వీటిని పొడిగిస్తారా?
అనేది అప్పటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రైలును బట్టి బోగీలను కలిపారు. కొన్ని రైళ్లకు ఏసీ బోగీలు, మరికొన్ని రైళ్లకు స్లీపర్ బోగీలు, ఇంకొన్ని రైళ్లకు జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు. దీనివల్ల రానున్న రోజుల్లో రద్దీని నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ-కాచిగూడ
కాచిగూడ - విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ కు ఒక ఏసీ చైర్ కార్ బోగీ
విజయవాడ-గూడూరు
గూడూరు - విజయవాడ విక్రమ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ రైలుకు ఒక చైర్ కార్, ఒక థర్డ్ ఏసీ బోగీ
తిరుపతి-హుబ్లి,
హుబ్లీ - తిరుపతి రైలుకు 2 స్లీపర్ బోగీలు పెంచారు.
తిరుపతి-గుంతకల్,
గుంతకల్- తిరుపతి రైలుకు 2 స్లీపర్ బోగీలు
తిరుపతి-కదిరిదేవరపల్లి,
కదిరిదేవరపల్లి- తిరుపతి రైలుకు 2 స్లీపర్ బోగీలు అదనంగా చేర్చారు.
గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ
సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు ఒక చైర్ కార్, ఒక థర్డ్ ఏసీ బోగీ
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్,
సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక థర్డ్ ఏసీ బోగీ
మచిలీపట్నం-ధర్మవరం,
ధర్మవరం- మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కు ఒక సెకండ్ ఏసీ బోగీ కలిపారు.
8 రైళ్లకు 3 జనరల్ బోగీలను అదనంగా జత చేస్తున్నారు.
పూర్ణ-ఆదిలాబాద్ (57653),
ఆదిలాబాద్-పర్లి వైధ్యనాథ్ (57654)
హెచ్.ఎస్. నాందేడ్- మన్మాడ్,
మన్మాడ్- హెచ్.ఎస్. నాందేడ్
పర్లి వైధ్యనాథ్-అకోలా-పూర్ణ
పూర్ణ-పర్లి, వైధ్యనాథ్-పూర్ణ రైళ్లకు మూడు చెప్పున జనరల్ బోగీలు పెరిగాయి.












Click it and Unblock the Notifications