షాక్: కాపీ కొడుతూ పట్టుబడి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి
కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడిన ఓ పదో తరగతి విద్యార్థి ఆ అవమాన భారం తట్టుకోలేక పాఠశాల భవనం పైనుంచి దూకేశాడు.
హైదరాబాద్: కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడిన ఓ పదో తరగతి విద్యార్థి ఆ అవమాన భారం తట్టుకోలేక పాఠశాల భవనం పైనుంచి దూకేసిన ఘటన సోమవారం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కంచన్ బాగ్ లోని విద్యాదాయిని మోడల్ హై స్కూల్ లో సన్నీత్ రెడ్డి(15) పదో తరగతి పరీక్ష రాస్తున్నాడు. సోమవారం పరీక్ష రాస్తుండగా అతడు కాపీయింగ్ కు పాల్పడడంతో ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఆన్సర్ షీట్ తీసేసుకుని పరీక్ష హాలులోంచి బయటికి పంపించేశాడు.

ఇది అవమానంగా భావించిన సన్నీత్ రెడ్డి మూడో అంతస్తు కారిడార్ నుంచి కిందికి దూకేశాడు. పాఠశాల సిబ్బంది గమనించి హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం సన్నీత్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజిలను పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications